గ్రేటర్ న్యూస్, హనుమకొండ : తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ,కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జాతీయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్, జాతీయ చైర్మన్ పోలోజు రాజ్ కుమార్ ఆచార్య,కార్య నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ వలబోజు మోహన్ రావు, కన్వీనర్ పొన్నెకంటి శ్రీనివాసాచారి, కోఆర్డినేటర్ డాక్టర్ వేముల తిరుపతిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారం,నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఐకాన్ పురస్కారం, స్పోర్ట్స్ ఇండియన్ ఐకాన్ పురస్కారం,యూత్ ఇండియన్ ఐకాన్ పురస్కారం,ఉమెన్ ఇండియన్ ఐకాన్ పురస్కారం,భారత స్ఫూర్తికిరిటీ పురస్కారం, నటరాజ పురస్కారం, మహానంది పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,కర్ణాటక,తమిళనాడు, ఒరిస్సా,మహారాష్ట్ర,పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఈవెంట్ ఆర్గనైజర్స్,ఈవెంట్ మేనేజర్స్,డాన్స్ మాస్టర్లు, యాంకర్లు,సాహిత్యం,రచన,కవులు, కళాకారులు,సంగీతం,నృత్యం, భరతనాట్యం,కూచిపూడి,కోలాటం, చిత్రలేఖనం,శిల్పి,నాటకం,జానపదం, మిమిక్రీ,అవధానం,విద్య,వైద్యం,ఇంద్రజాలం,ముఖాభినయం,హరికథ,ఒగ్గు కథ,బుర్రకథ,రంగస్థలం కళాకారులు,వాస్తు,జ్యోతిష్యం,భక్తి,పురోహితం,యోగా,క్రీడా,సామాజిక సేవా,షార్ట్ ఫిలిం,పర్యావరణ పరిరక్షణ,సైన్స్ అండ్ టెక్నాలజీ,డోలక్, హార్మోనియం,భజన కళారంగం,వ్యవసాయం,కరాటే,మ్యాజిక్,టీవీ నాటక కళాకారులు,వాయిద్య కళాకారులు,యువజన మహిళా సంఘాలు,ఉపాధ్యాయ,ఉద్యోగ,విద్యార్థులు,గ్రామీణ అభివృద్ధి తదితర రంగాలలో పనిచేస్తున్న ప్రతిభావంతులైన వారు పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు.దరఖాస్తులు ఈ నెల 31 వరకు పంపాలన్నారు. పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జనవరి 25న వరంగల్ నగరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.పూర్తి వివరాలకు 9100174351,9494400158 నంబర్లలో సంప్రదించాలన్నారు.

