గ్రేటర్ న్యూస్, హనుమకొండ : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా ప్రజలందరికీ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఆరంభాలకు నాంది పలికే శుభసందర్భమని ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంట సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నిండాలని ఆకాంక్షించారు.జిల్లా ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండి అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

