పిల్లల ఆరోగ్యం కోసం ఓ గ్రామం వినూత్న ప్రయత్నం..
గ్రేటర్ న్యూస్,మహబూబాబాద్ : జిల్లా పరిధిలోని గూడూరు గ్రామం లోకి ఐస్ క్రీమ్ ఆటోలు,ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదని గ్రామ పెద్దలు, గ్రామస్థులు బ్యానర్లు ఏర్పాటు చేశారు.నిషేధాన్ని ఉల్లంఘించి ఐస్ క్రీం బండి ఊర్లోకి వస్తే రూ.5,000 జరిమానా విధించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.ఇప్పుడు ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.

