గ్రేటర్ న్యూస్, వరంగల్ :మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్రుల మహెూత్సవములు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. నాలుగవ రోజు కార్యక్రమాలలో భాగంగా ఆదివారం ఉదయం అర్చకులు అమ్మవారికి లక్ష గులాబీ పూలతో పుష్పా అర్చన జరిపి అమ్మవారికి నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు.

