గ్రేటర్ న్యూస్,మేడారం : సమ్మక్క, సారలమ్మ దర్శనాలను బుధవారం నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు.ఈ సందర్బంగా ఆలయ ఆవరణలో ఆయన మాట్లాడుతూ… గోవిందరాజు పగిడిద్ద రాజుల గద్దెల ప్రతిష్ఠాపన కార్యక్రమాలతో పాటు గద్దెల విస్తరణ పనులు సాగుతున్నట్లు చెప్పారు. దీంతో ఈ నెల 24 వ తేది ఒక్కరోజు అమ్మవార్ల దర్శనాలు నిలిపివేస్తున్నామని, భక్తులు సహకరించాలని ఆయన కోరారు.

