యశోద హాస్పిటల్స్ డాక్టర్ శశికాంత్ మద్దు
గ్రేటర్ న్యూస్,వరంగల్ : పుట్టుకతో వచ్చే
శారీరక లోపాలు, తీవ్రమైన ప్రమాదాలు,
వల్ల సంక్లిష్టమైన క్రానియోఫేషియల్ (ముఖం, తల ఎముకల) సమస్యలతో బాధపడుతున్న పిల్లల కోసం
సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్
సరికొత్త ఆశలను కల్పిస్తోందని డాక్టర్ మద్దు శశికాంత్ తెలిపారు. మంగళవారం హనుమకొండ యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ….పీడియాట్రిక్ రికన్స్ట్రక్టివ్ కేర్ (పిల్లల పునర్నిర్మాణ సంరక్షణ) విభాగంలో అత్యాధునిక మైక్రోసర్జికల్ విధానాలు, సమగ్రమైన మల్టీడిసిప్లినరీ వైద్య
సేవలను జోడించి, ఆసుపత్రి అద్భుతమైన వ్యక్తిగతీకరించిన చికిత్సలను అందిస్తోంది.
దీని ద్వారా పిల్లల శరీర అవయవాల పనితీరును, రూపాన్ని మెరుగుపరుస్తూ వారిలో నూతన ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ఈ ప్రత్యేక విభాగం ద్వారా పిల్లల్లో ఎదురయ్యే సమస్యలకు విజయవంతంగా సర్జరీలు నిర్వహిస్తున్నారు. ముఖ వైకల్యాలు,గ్రహణం మొర్రి సంబంధిత పలు లోపాలు, పుట్టుకతో వచ్చే చేతి లోపాలు,
వేళ్ల సమస్యలు, ముఖ నరాల గాయాలు,
ప్రమాదాలు లేదా క్యాన్సర్ చికిత్సల తర్వాత
తీవ్రంగా దెబ్బతిన్న కణజాలాల పునర్నిర్మాణం.
అత్యాధునిక మైక్రోసర్జికల్ టెక్నాలజీని
ఉపయోగించి, సర్జన్లు శరీరంలోని ఇతర
భాగాల నుండి ఆరోగ్యకరమైన కణజాలాన్ని
కచ్చితత్వంతో లోపాలున్న చోటుకు
అమర్చుతారు. ఈ విధానం వల్ల పేషెంట్లు
చాలా త్వరగా కోలుకోవడమే కాకుండా,
దీర్ఘకాలిక సమస్యలు తగ్గి, ముఖం సహజంగా
కనిపించేలా ఫలితాలు వస్తున్నాయని వైద్యులు
తెలిపారు. “పిల్లలకు చేసే రికన్ఫక్టివ్ సర్జరీలకు
ప్రత్యేక నైపుణ్యం, ముందస్తు ప్రణాళిక ఎంతో
అవసరం. ఆధునిక మైక్రోవాస్కులర్ ప్లాస్టిక్
సర్జరీ ద్వారా పిల్లల్లో తినడం, మాట్లాడటం,
ముఖ కవళికలు వంటి ప్రాథమిక విధులను
పునరుద్ధరించడమే కాకుండా, అద్భుతమైన
సౌందర్య ఫలితాలను సాధించగలం.” అని
సీనియర్ ప్లాస్టిక్, రికన్ఫక్టివ్ సర్జన్, యశోద
హాస్పిటల్స్ డాక్టర్ శశికాంత్ మద్దు తెలిపారు.
యశోద హాస్పిటల్స్ అనుభవజ్ఞులైన రికన్నక్టివ్
సర్జన్లు, అధునాతన సర్జికల్ థియేటర్లు
మరియు ప్రత్యేక పీడియాట్రిక్ రిహాబిలిటేషన్
సపోర్ట్ ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణను
అందిస్తోంది. గత మూడు దశాబ్దాలుగా
వైవిధ్యమైన వైద్య అవసరాలకు నాణ్యమైన
ఆరోగ్య సేవలను అందిస్తూ యశోద గ్రూప్
ఆఫ్ హాస్పిటల్స్ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా
ఎదిగింది. విప్లవాత్మక సాంకేతిక
అరుదైన, క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతం
చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని
సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్పేట్,
హైటెక్ సిటీలలో ఉన్న 4 స్వతంత్ర ఆసుపత్రుల
ద్వారా మొత్తం 4000 పడకల సామర్థ్యంతో
నడుస్తోంది. అత్యంత ఖరీదైన మినిమల్లీ
ఇన్వేసివ్ చికిత్సలను సైతం సామాన్యులకు
తక్కువ ధరలకే అందిస్తుందని తెలిపారు.

