సమన్వయంతో పనిచేసి మేడారం జాతరను విజయవంతం చేద్దాం… వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

గ్రేటర్ న్యూస్, ములుగు : పోలీస్ అధికారులు సమన్వయంతో పని చేసి మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ను విజయవంతం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు.
జనవరి చివరి వారంలో ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర వరంగల్ పోలీస్ కమిషనర్ కి ట్రాఫిక్ బందోబస్త్ బాధ్యతలు అప్పగించడంతో, వరంగల్ సీపీ కమిషనరేట్ కు చెందిన డిసిపి, అదనపు డిసిపి, ఏసీపీ లతో హన్మకొండ జిల్లా కేంద్రం నుండి జాతర జరిగే ప్రదేశం ప్రధాన రోడ్డు మార్గాన్ని సీపీ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ మార్గం లో వాహన పార్కింగ్, హోల్డింగ్, ట్రాఫిక్ సమస్య లు తలెట్టే ప్రదేశాల్లో ఏర్పాటు బందోబస్త్ సీపీ క్షేత్ర స్థాయిలో సమీక్ష జరిపారు. అనంతరం సీపీ గట్టమ్మ గుట్ట వద్ద ఆర్టీసీ బస్సు లు, ప్రైవేట్ వాహనాల పార్కింగ్ ప్రదేశాలతో పాటు,జాతర ప్రదేశాన్ని చేరుకునే మార్గాలు, అలాగే ట్రాఫిక్ సమస్య తలెట్టినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై సీపీ సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న వరంగల్ సీపీ..

బుధవారం ఉదయం మేడారం కు చేరుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సమ్మక్క -సారలమ్మ లను దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు.
సీపీ వెంట ములుగు ఎస్పీ సుధీర్ కేకన్, ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, ములుగు ఓ. ఎస్. డి శివం ఉపాధ్యాయ, అదనపు డిసిపి ప్రభాకర్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, సత్యనారాయణ, సతీష్ బాబు, ములుగు డి. ఎస్పీ రవీందర్ తో ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *