సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం…

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్:అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏ డబ్ల్యూ ఎస్ ) ప్రతినిధి బృందం మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి, ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ ప్రాజెక్టులు, తెలంగాణలో ఏ డబ్ల్యూ ఎస్ విస్తరణ ప్రణాళికలపై చర్చలు జరిపింది.ఈ ప్రతినిధి బృందంలో కెర్రీ పర్సన్, వైస్ ప్రెసిడెంట్ (AWS గ్లోబల్ ఆపరేషన్స్ అండ్ డేటా సెంటర్ డెలివరీ) :విక్రమ్ శ్రీధరన్, డైరెక్టర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ పాలసీ, AWS); అనురాగ్ ఖిల్నాని, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ డెలివరీ) తదితర సీనియర్ అధికారులు ఉన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడులు, విస్తరణ కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *