25 Feb 2026, Wed

జమ్మికుంట లో రోడ్డు ప్రమాదం… పలువురికి తీవ్రగాయాలు

గ్రేటర్ న్యూస్, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. హుజూరాబాద్ నుంచి జమ్మికుంటకు వస్తున్న ఆర్టీసీ మినీ బస్సు ఫ్లై ఓవర్ ఎక్కుతున్న క్రమంలో బస్సు ముందు టైర్ పేలడంతో బస్సు డివైడర్ ను ఢీకొట్టింది. బ్రిడ్జి సేఫ్టీ అడ్డుగోడకి తగిలి బస్సు ఆగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *