గ్రేటర్ న్యూస్,హనుమకొండ : ఇటీవల హనుమకొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్ పాయ్ మంగళవారం హైదరాబాద్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లాలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆకాంక్షించారు.

