గ్రేటర్ న్యూస్, కరీంనగర్ : కరీంనగర్ జ్యోతినగర్లోని PMJ జ్యూవెలరీ షాపులో దొంగలు ఆదివారం పట్టపగలే బీభత్సం సృష్టించారు. ఐదుగురు దుండగులు తుపాకీలతో లోపలికి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం భారీగా బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం… పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

