గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : మన దేశంలో ఈ రోజు మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం ముగిసింది. సాయంత్రం 6.47కు గ్రహణం వీడింది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణాన్ని 6.20 నుంచి గ్రహణం ముగిసే వరకు వీక్షించారు. ఇక మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూలై 6న ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

