గ్రేటర్ న్యూస్, ఢిల్లీ : ఆన్లైన్ ఫార్మసీల ధోరణికి నిరసనగా ఈ నెల 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ కు AIOCD పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో భాగంగా సుమారు 12.40 లక్షల దుకాణాలు మూతబడనున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం, భారీ డిస్కౌంట్లతో చిరు వ్యాపారుల పొట్ట కొట్టడాన్ని అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆన్లైన్ అమ్మకాలను నియంత్రించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

