గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం :నర్సంపేటలో ఆర్టీసీ డిపో డ్రైవర్ బస్టాండ్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థలాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘటన జరిగిన తీరును సంబంధిత పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ కమిషనర్ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, స్పెషల్ బ్రాంచ్, నర్సంపేట ఏసీపీలు జితేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, సాయి రమణ, దుగ్గొండి ఎస్ఐ రణధీర్ ఉన్నారు.



