Breaking
1 Jun 2026, Mon

న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలలో కలిగించాలి : వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

గ్రేటర్ న్యూస్, వరంగల్ క్రైం : పోలీసుల వద్దకు వెళ్ళితే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్  అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా ఇన్స్ స్పెక్టర్ల నుండి ఏసీపీ లుగా పదోన్నతి పొందిన గొర్ల సీతారెడ్డి, బోలగాని శ్రీనివాస్ గౌడ్, సార్ల రాజు లు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయని, నిరంతరం క్రింది స్థాయి అధికారుల పని తీరును పర్యవేక్షణ చేయడంతో వారి దిశా నిర్దేశం చేయాలని, పోలీస్ శాఖ గౌరవం మర్యాదలు పెంపొందించే విధంగా వెదురు నిర్వర్తించాలని సీపీ అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *