గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : సివిల్స్ పరీక్ష ఫలితాలను UPSC శుక్రవారం విడుదల చేసింది. అనూజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ పరీక్షల్లో తెలుగురాష్ట్రాల్లోని అభ్యర్థులు సత్తాచాటారు. సృజన (55వ ర్యాంక్), డీఎస్కే ప్రచేత్ (193వ ర్యాంక్), ఎస్.వర్షిత్రెడ్డి (259వ ర్యాంక్), ఎం.పవన్కుమారెడ్డి (297వ ర్యాంక్), వి. విక్రమసింహారెడ్డి (541వ ర్యాంక్), గుమ్మల శ్వేత (573వ ర్యాంక్), పోతుపురెడ్డి భార్గవ్ (537వ ర్యాంక్) బీటీ విక్రమ్ 472 ర్యాంక్ సాధించారు.

