గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ : T20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన సందర్బంగా హైదరాబాద్కు చేరుకున్న టీమ్ ఇండియా ఆల్ రౌండర్ క్రికెటర్ తిలక్ వర్మ సోమవారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి , మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి , తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

