నేడు పలు జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ !

గ్రేటర్ న్యూస్, హైదరాబాద్ :తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. రాష్ట్రంలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, HYD, WGL, MBNR, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాలతోపాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *