గ్రేటర్ న్యూస్, క్రైం : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలులో తల్లి, ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్లో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనను గురువారం వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ప్రీత్ సింగ్ IPS తీవ్రంగా పరిగణించి ఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఇతర అధికారులతో కలిసి కేసు దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మరణాలకు గల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి, త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని అధికారులను సీపీ ఆదేశించారు.

